JEO-Tirumala-Tirupati-Devasthanams-(TTD)-Tirupati
Sri B.Lakshmikantham, IAS
J.E.O. : Joint Executive Officer, TTD, Tirupati
Tirumala Tirupati Devasthanams
TTD Administrative Building
K.T. Road, Tirupati – 517 501
Andhra Pradesh, India
10-ఫిబ్రవరి-2019
నేడు తిరుపతి జేఈవో బాధ్యతల స్వీకరణ
తితిదేపై పట్టుకలిగిన అధికారిగా లక్ష్మీకాంతం గుర్తింపు
సీఎం నిర్ణయంతో నియామకం
లక్ష్మీకాంతానికి స్వాగతం పలుకుతున్న డిప్యూటీ ఈవో బాలాజీ
తిరుమల, న్యూస్టుడే: తితిదే తిరుపతి జేఈవోగా బి.లక్ష్మీకాంతం ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరుగా పని చేసిన ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిభను గుర్తించిన ముఖ్యమంత్రి తితిదే జేఈవోగా నియమించారు. ఈయన ఏడేళ్ల కింద తితిదే ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవోగా వసతి కల్పన విభాగంలో పని చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి భక్తులకు సులభంగా గదులు లభించేలా సంస్కరణలు తీసుకువచ్చారు. గదులు ఆధునికీకరణ, భక్తులకు ప్రత్యేక వసతులు కల్పనలాంటి చర్యలు తీసుకున్నారు. దేవస్థానంపై పట్టున్న వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తిరుపతి జేఈవోగా కీలక బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంది. అలిపిరిలో భారీ వసతి సముదాయం నిర్మాణం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం, హైదరాబాదులో నిర్మించిన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, దేవస్థానం పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావడానికి విశేష కృషి చేయాల్సి ఉంది. దేవస్థానంలో తిరుపతి జేఈవోకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. పరిపాలనలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తిగా పేరొందిన లక్ష్మీకాంతం ఆదివారం ఉదయం 8.30 గంటలకు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు సీˆ్వకరించనున్నారు. తిరుమలకు శనివారం రాత్రి చేరుకున్న ఆయనకు తితిదే వసతి కల్పన విభాగం డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.