08th-09th-November-2018-NewsClips
తాజావార్తలు
పండుగ మనం చేసుకుంటాం కాదు
నాదగ్గర ఉన్నవాళ్లు సంతోషంగా వుండటమే నిజమైన పండుగ అని
చాటి చెప్పిన కృష్ణ జిల్లా కలెక్టర్ గారి కుటుంబం
మచిలీపట్నం: దీపావళి సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ కాంతం తన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, పనివారికి బట్టలు పంపిణి చేశారు. ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన నూతన వస్త్రాలు, మిఠాయిలు, బాణాసంచా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కడ విధులు నిర్వహిస్తున్నా దీపావళి సందర్భంగా తన వద్ద పనిచేసే వారికి కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా పాటిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ తమకు దుస్తులు, మిఠాయిలు పంపిణీ చేయడం పట్ల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.